నేటి సాక్షి, కొడిమ్యాల నవంబర్,29కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. విలేకరుల సమావేశంలో మాట్లాడుతు గ్రామ గ్రామానికి ఉపాధి హామీ, పనులు ఇందిరమ్మ ఇండ్లకు, లక్షనలభై ఐదు వేయిలు ఇస్తూ . ప్రభుత్వ స్కూలుకు వెళ్లే పిల్లలు దూరం నుండి నడిచి వెళ్తుంటే ఇబ్బందిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గమనించి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిందని తెలియజేస్తూ, అన్ని విధాలుగా దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పట్నాల నుంచి పల్లెల వరకు అభివృద్ధి చేయుటకు నిధులు మంజూరు చేస్తున్న బిజెపి, స్థానిక సర్పంచ్ ఎలక్షన్ లో మండలంలోని 24 గ్రామపంచాయతీలలో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, పెరుక శ్రావణ్ మండల బిజెపి అధ్యక్షులు బండ నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నాంపల్లి రాజేశం సీనియర్ నాయకులు ఏలేటి నరసింహారెడ్డి. అక్కెనపల్లి నరేష్. కార్యకర్తలు పాల్గొన్నారు




