నేటి సాక్షి 25 పాములపాడు:- పాములపాడు మండల నూతన ఎస్సైగా పి.తిరుపాలు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై పి.తిరుపాలు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. మాది అనంతపురం జిల్లా అని గతంలో జూపాడుబంగ్లా మండల ఎస్సైగా మరియు ఇతర మండలాలలో కూడా పనిచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ నుండి పాములపాడుకు బదిలీపై వచ్చి ఈరోజు జాయిన్ కావడం జరిగిందన్నారు.





