నేటి సాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణంలో పారిశుద్ధ్య మెరుగునకు తగు చర్యలు చేపట్టాలని జగిత్యాల అదనపు కలెక్టర్ బిఎస్ లత అధికారులకు సూచించారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఆమె పర్యటించారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. వార్డుల్లో చెత్త సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు, వీరి వెంట తాసిల్దార్ నాగార్జున, కమిషనర్ మనోహర్ గౌడ్, మేనేజర్ వెంకటి తదితరులు పాల్గొన్నారు





