నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 27,
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నారాయణపేట మూడవ మహాసభలను జయప్రదం చేయాలంటూ శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో కరపత్రాల విడుదల కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తిరుమల నరసింహ ఆధ్వర్యం లో నిర్వహించారు. మరికల్ మండల కేంద్రంలోని నంది ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇట్టి కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బాల నరసింహ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్, మండల కార్యదర్శి నాగరాజు, రాము మండల కార్యదర్శి రాము, వాళ్ల ఆధ్వర్యంలో వాల్పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.





