నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 3,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని, స్థానిక బీసీ కాలనీలో గూరకొండ ఈదమ్మ గారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో, ఈరోజు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా సూర్య మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు విడుతలవారీగా అందరికీ కూడా మంజూరయ్యే విధంగా చూస్తానని తెలియజేయడం జరిగినది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు కూడా ఇండ్ల నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరడం జరిగినది. వీరి వెంట స్థానిక మండల నాయకులు పోలేమోని రామకృష్ణ, మధు రెడ్డి, జి శేఖర్, సద్దాం, బొంత.మోహన్, బోయ రఘు, జి ఎల్లప్ప, పి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.





