నేటిసాక్షి : జగదేవపూర్ అక్టోబర్ 25పేదింటి ఆడబిడ్డకు పుస్తె,మెట్టెలు పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు. మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన సోమొల్ల సాయిలు లలిత చిన్న కుమార్తె పెళ్లి సందర్భంగా గ్రామానికి చెందిన డోనేషన్ డూ ఫర్ నేషన్ స్వచ్చంద సంస్థ ద్వారా పుస్తే మట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నరేష్ రెడ్డి, పండరి, బిక్షపతి, రామ్మోహన్ రెడ్డి, అజీజ్, (అజ్జు), గణేష్, కనకయ్య,నర్సిములు, శ్రీశైలం, సత్యం, కర్ణకర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.





