నేటి సాక్షి2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియలో మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఉద్యోగులు పోలింగ్ రోజున ప్రత్యేక సాధారణ సెలవు సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు

