*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని సర్పంచ్ కాసారపు భవాని-అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ కాసారపు భవాని-అరవింద్ గౌడ్ మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు అయిన వాక్ స్వాసంత్రం అక్రమ కేసుల నుండి రక్షణ చట్టం ముందు అందరూ సమానులే మరియు అంటరాని తనాన్ని ఎవరు పాటించొద్దు అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసారపు భవాని-అరవింద్ గౌడ్ ఉప సర్పంచ్ సిరవేణి రవి, బుర్ర తిరుపతి గౌడ్ మాజీ సర్పంచ్,గ్రామపంచాయతీ కార్యదర్శి బొమ్మెళ్ళ నరేష్ ,వార్డుమెంబర్లు అరెల్లి నవ్య మోహన్, ఎండ్రికాయాల గంగాధర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాపు రెడ్డి,గ్రామ పాలనధికారి జెనర్దన్ బుజ్జక్క ఆశావర్కర్లు, చరణ్ రాజేందర్ మరియు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




