Tuesday, June 17, 2025

ప్రజా వైద్యులు రాజగంగారాం మరణం తీరని లోటు

  • వైజ్ఞానిక సమాజ నిర్మాణ స్వాప్నికులు ప్రజా వైద్యులు రాపెల్లి రాజగంగారాం
  • జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లారపు రాజయ్య
  • గ్రామీణ ప్రజావైద్యుల సంఘాలకు బాసటగా కీలక నేత రాజగంగారాం

నేటి సాక్షి – కోరుట్ల(అర్బన్)
( విఆర్.ధర్మేందర్ )

వైజ్ఞానిక సమాజ నిర్మాణ స్వాప్నికులు ప్రజా వైద్యులు, జనవిజ్ఞాన వేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి, కోరుట్ల మండల జె వి వి అధ్యక్షులు రాపెల్లి రాజగంగారాం అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లారపు రాజయ్య,పాత్రికేయులు ఆముద లింగారెడ్డి లు కొనియాడారు. జె వి వి జగిత్యాల జిల్లా నాయకులు రాజగంగారాం మృతి సామాన్య ప్రజలతోపాటు,జె వి వి సంస్థకు తీరని లోటని వారు అన్నారు. కోరుట్ల పట్టణానికి చెందిన ప్రజా వైద్యులు రాపెల్లి రాజగంగారాం అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందగా కోరుట్ల పట్టణంలో సోమవారం నిర్వహించిన అంత్యక్రియలలో జనవిజ్ఞాన వేదిక నాయకులు, జిల్లా ఆర్ఎంపి, పిఎం పి అసోసియేషన్ సంఘాల అధ్యక్షులు ఆయిల్నేని రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆకుల నాగరాజు లు పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈసందర్బంగా బొల్లారపు రాజయ్య, ఆముద లింగారెడ్డి లు మాట్లాడుతూ గత నాలుగు దశబ్దాలుగా కోరుట్ల పట్టణం తోపాటు మండలంలోని గ్రామాల సామాన్య ప్రజలకు అనుభవం గల ఆర్ ఎం పి వైద్యునిగా వైద్య సేవలు అందిస్తూనే జన విజ్ఞాన వేదిక అనే సైన్స్ ఒరియాంటెడ్ స్వచ్చంద సంస్థలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కోరుట్ల మండల అధ్యక్షులు గా కొనసాగుతుండడం ఆయన సామజిక సేవా దృక్పదానికి నిదర్శనం అని అన్నారు. ఆర్ ఎం పి, పి ఎం పి సంఘాల నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఆకుల నాగరాజు లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల పాత తాలూకా గ్రామీణ ప్రజావైద్యుల సంఘాల బలోపేతానికి నిర్వీరామ కృషి చేశారని కొనియాడారు.అంత్యక్రియలలో ఆర్ ఎం పి, పి ఎం పి సంఘాల కోరుట్ల పట్టణ అధ్యక్షులు సంద శ్రీపతి, కార్యదర్శి కొక్కుల శ్రీనివాస్, చంద్రప్రకాష్, అబ్దుల్లా, జగిత్యాల జిల్లా లోని గ్రామీణ వైద్యులు,రాజ గంగారాం ఆత్మీయ బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సాధారణ ఆర్ ఎం పి నుండి తన పిల్లలను ఉన్నత వైద్యులుగా తీర్చిదిద్ది….

కోరుట్ల లో నాలుగు దశాబ్దాల క్రితం సాధారణ ఆర్ ఎం పి ప్రజావైద్యునిగా తన సుదీర్ఘ ప్రస్థానం నుండి సామజిక సేవ, ప్రజాసంఘాల్లో కడవరకు అందెవేసిన చేయిగా వ్యవహారిస్తూనే తన తన పిల్లలను ఉన్నత వైద్యులుగా తీర్చిదిద్దిన ఘనత రాజగంగారాం కే దక్కుతుంది. తనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ముగ్గురు సంతానం కాగా ముగ్గురికి ముగ్గురు వైద్య రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు శ్రీధర్ కార్డియాలాజిస్ట్ గా జిల్లా కేంద్రంలో వైద్యాసేవలు అందిస్తుండగా, చిన్న కుమారుడు కమల్ ఎం ఎస్ జనరల్ సర్జన్ కాగా కూతురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల మెడికల్ ఆఫీసర్ గా ప్రభుత్వానికి సేవలు అందిస్తుండడం వైద్య రంగం పట్ల దివంగత ప్రజావైద్యులు రాజగంగారాం కు ఉన్న మక్కువ తన పిల్లలతో తీరినట్లయిందనిజిల్లా ఆర్ యం పి వైద్యుల సంఘం అధ్యక్షులు ఆయిల్నేని రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆకుల నాగరాజు
పలువురు అభినందించారు.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News