నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………..జగిత్యాలలోని 108 సిబ్బంది మంచాల మానస చాక చక్యంగా వ్యవహరించి ఒకరి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబాల అభినందనలు అందుకున్నారు.అర్ధరాత్రి ప్రాంతంలో జగిత్యాల రూరల్ మండలం చిన్నగట్టు ఆంజనేయస్వామి దగ్గర బైక్ – కారు ఎదురేదురుగా డికొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తక్షణం 108 లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలు కాగా ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉండగా 108 సిబ్బంది మంచాల మానస ప్రథమ చికిత్స చేసి తక్షణం ప్రభుత్వాలు చేర్పించి ప్రాణాలు కాపాడారు.దీంతో మానసను కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.




