నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం గ్రామం ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులుప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులుగా, ఉపాధ్యాయులుగా గౌతమి, శ్రావ్య, సుశాంత్, భరత్, ప్రియాంక, కౌశిక్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజం, నర్సిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉపాధ్యాయులు స్వాతి, నాగేశ్వరి, రేణుక, జనార్ధన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సామ్రాజ్యం గోపాల్, గ్రామ పెద్దలు రాఘవరెడ్డి, తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.





