*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉమ్మడి మేడిపల్లి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎదలాపురం దయాకర్ మువ్వన్నెల జెండా ఎగరవేశారు భారత్ మాతాకీ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు అధ్యక్షులు దయాకర్ మాట్లాడుతూ నిన్ను నన్ను కన్నతల్లి భరతమాత ఒక్కటే నువ్వు నేను బ్రతుకుతున్న భరతభూమి ఒక్కటే అని అన్నారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎదలాపురం దయాకర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ప్రవీణ్ రావు, గౌరవ అధ్యక్షులు లక్ష్మీపతి, రఫీ, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్,సహాయ కార్యదర్శి రహీం, కోశాధికారి అశోక్,కార్యవర్గ సభ్యులు వజ్ర లింగం, గంగనర్సయ్య,రమేష్,అనిల్, చిరంజీవి,ప్రకాష్,వేణు,సాయి, మేడిపల్లి గ్రామ సర్పంచ్ మకిలి దాస్,ఉప సర్పంచ్ తోపారపు అర్జున్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు,మాజీ ఎంపీపీ మకిలి ఇజ్రాయిల్,మేడిపల్లి గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.





