నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఫేత్ బంజారా అనాధ శరణాలయంలోనిగురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల సమక్షంలో పాస్టర్ హన్యా నాయక్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి కరుణ తోటి మానవాళి పట్ల ప్రేమను పంచాలని ఏసుక్రీస్తు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో అందరూ మెలగాలని, ప్రేమ, కరుణ పెరిగి ఇతరుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పేదల పట్ల స్నేహ గుణం కలిగి వారికి అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.





