నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 19,జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరూ సమిష్టిగా కృషి చేసి బాల్య వివాహా రహిత జిల్లాగా నారాయణపేటను మార్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ-జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యంగా బాలల రక్షణ పట్ల, వారి విద్య , సంరక్షణ,ఎదుగుదల, జిల్లా ఆకృతిని ప్రతిబింబించేలా రూపొందించిన లోగోను కలెక్టర్ తన ఛాంబర్ లో బుధవారం ఆవిష్కరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ సహకరించాలని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గాంగ్వర్, శ్రీను, ఆర్డిఓ రామ్ చందర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, డీ పీ ఆర్ వో రషీద్, భగీరథ ఈ ఈ రంగా రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, కోస్గి తహసిల్దార్ బక్క శ్రీనివాస్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని కరిష్మా పాల్గొన్నారు.





