నేటి సాక్షి మార్చి 10 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జరిగిన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం అనంతరం, గోమాస బ్రహ్మానందం ను బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి గా నియమించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సీనియర్ నాయకులు కాదా సి రవీందర్, గోలేటి నారాయణకు బి ఎస్ పి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు కాదాసి రవీందర్ జిల్లా ఇంచార్జి లు దాగం శ్రీనివాస్ మరియు నాగుల కిరణ్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు బోయినపల్లి సంతోష్ కుమార్ ఈసీ మెంబర్ శెట్టి ప్రవళిక మరియు ఎండి మతిన్ ఖాన్ మందమరి పట్టణ అధ్యక్షు డు గాజుల శంకర్ నూతనంగా పార్టీలో చేరిన గోలేటి నారాయణ మహిళా నాయకురాలు ముల్కల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.*





