నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జనవరి 26 కొమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నందు 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్.జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారుఅనంతరం వారు మాట్లాడుతు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ విరాజిల్లడానికి మన రాజ్యాంగమే పునాది అనిభారత రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని దేశ సమగ్రత కోసం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో MLA పాల్వాయి హరీష్ బాబు, డా. కొత్తపల్లి అనిత, పరిపెల్లి రాణి, మారోజు రాంబ్రహ్మం,హన్మంతు రావ్, సిందం శ్రీనివాస్, అరుణ్ లోయ, శివ గౌడ్, మనోహర్ గౌడ్,విజయ్, దెబ్బటి శ్రీనివాస్, పట్టణ బీజేపీ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్లు, బూత్ స్థాయి కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





