Monday, January 19, 2026

బోయకొండ గంగమ్మకు హుండీ ద్వారా రూ 48.85 లక్షల ఆదాయం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 8ఆంధ్ర రాష్ట్రము, అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు అనగా 08-01-2026న గురువారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 31 రోజులకు గాను నగదు రూపంలో రూ. 48,85,165.00, బంగారు 000-19-000 గ్రాములు, వెండి 000-292-000 గ్రాములు, ఫారెన్ కరెన్సీ – 1) Central Bank of Sri Lanka (20 Rupees) – 1 Note మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 28,943.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, చిత్తూరు జిల్లా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమీషనరు శ్రీమతి K. చిట్టెమ్మ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ – చౌడేపల్లి వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News