నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 21,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో మంగళవారం పాతాళగంగ పైకి పారుతుంది. కిష్టాపురం గ్రామ రైతులు సంతోషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మూడెకరాల భూమిలో ఇటీవల వేసిన బోర్లలో పాతాళ గంగమ్మ పైకి పారడంతో రైతులు సంతోషిస్తున్నారు. దీంతో పేట నియోజక వర్గం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి చేసిన సహకారం మర్చిపోమని రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





