నేటి సాక్షి . చిలుకూరు *మీడియా సమావేశంలో ఖండించిన టిడిపి నాయకులు.. జనపనేని కృష్ణారావు* చిలుకూరు . మండలం రామాపురం గ్రామంలో.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పై బి ఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని టిడిపి నియోజకవర్గ నాయకులు జనపనేని కృష్ణారావు విమర్శించారు. మండలంలోని రామపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఆర్ ఎఫ్ చెక్కులలో అవినీతి చేసింది ఎవరు ప్రజలందరికీ తెలుసు అన్నారు. అవినీతి రహిత పాలనందిస్తున్న మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి ఆరోపణ చేయడం హా స్యా స్పదమని అన్నారు. మీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు విమర్శలు చేయడం తగదని అన్నారు. సమావేశంలో టిడిపి కాంగ్రెస్ నాయకులు వేమూరి సురేష్ పుల్లూరు శ్రీనివాసరావు వేమూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.





