నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 3, మంత్రి వాకిటి శ్రీహరి సమక్షం లో మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామానికి చెందిన పలువరు బీఆర్ఎస్,బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వాకిటి శ్రీహరి నియోజకవర్గానికి మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి తాము కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులమై పార్టీలో చేరామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి శ్రీహరి గారు నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధిలో తాము పాలు పంచుకుంటామన్నారు.





