నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 16 అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆదివారం జరిగిన మాల మహానాడు రాష్ట్ర సభలకు మండలం నుంచి పలువురు మాల మహానాడు నాయకులు తరలి వెళ్లారు దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యల సాధన కోసం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రద్దు పరచుటకు అవసరమయ్యే ప్రణాళికలను మహాసభల్లో చర్చలు జరుగుతాయని ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షుడు కొత్తపల్లి మనీ అన్నారు అనంతరం పలువురు నాయకుల ఆధ్వర్యంలో సభలకు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ఉపాధ్యక్షుడు రెడ్డి ప్రసాద్ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యువజన అధ్యక్షుడు వాటర్ వాష్ మని సహాయ కార్యదర్శి గుట్టా రెడ్డి శేఖర్ సొరకాయల సురేష్ తదితరులు మదనపల్లి మహాసభలకు వెళ్లిన వారిలో ఉన్నారు




