( నేటి సాక్ష): శంకర్పల్లి మండలం మహారాజ్ పేట ఒకటవ వార్డు అభ్యర్థిగా మహమ్మద్ ఇర్ఫాన్ 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన వార్డు సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వార్డు ప్రజలు ప్రేమతో ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఉన్న పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని వార్డు ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు.





