Tuesday, March 17, 2026

మహేశ్వరం మార్కెట్ కమిటీల వేలం:కృష్ణనాయక్,సిహెచ్‌.యాదయ్య.*

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 11:)*మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వాణిజ్య సముదాయంలోని ఐదు కమర్షియల్ షాపుల వేలంపాట ఈరోజు నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎఎంసీ మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, వైస్‌ చైర్మన్ సిహెచ్‌.యాదయ్య పర్యవేక్షణలో ఐదు షాపులు ప్రాకతీయంగా ఎన్నుకోబడ్డాయి.ఎంపికైన వారు –షాప్ నం.1 – నరసింహ గౌడ్ ( ఓసి),షాప్నం.2 – లాజర్ ( ఎస్సీ),షాప్ నం.3 – మల్లేష్ (ఓసి),షాప్ నం.4 – గోపాల్ నాయక్ (ఎస్సీ),షాప్ నం.5 – శ్రీకాంత్ ( బీసీ).ఈ కార్యక్రమంలో చైర్మన్,వైస్ చైర్మన్‌లను శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ వేలంపాట ద్వారా నెలవారీగా రూ.53,650 ఆదాయం రావడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ ఆదాయం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడుతుంది అని తెలిపారు.కార్యక్రమంలో డీ.డి.ఎం.ప్రసాద్ రావు (హైదరాబాద్),ఇబ్రహీంపట్నం సెక్రటరీ సంతోష్ కుమార్,మహేశ్వరం మార్కెట్ కమిటీ సెక్రటరీ సుజాత, సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News