నేటి సాక్షి నారాయణపేట,ఏప్రిల్ 4,,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణ పేట నియోజక వర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డా చిట్టెం పర్ణికా రెడ్డి, నారాయణపేట జిల్లా మాజీ డి సి సి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి గార్ల ఆదేశాలమేరకు ,మరికల్ మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన కస్తుల శ్రీనివాసులు కి ముఖ్యమంత్రి సహాయనిది నుండి రూ,60,000 రూపాయల చెక్కును జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ,ఆపదలో వున్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ,మానవత దృక్పథంతో సేవలు అందిస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమములో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న , మరికల్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటేకొండ ఆంజనేయులు, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ , మాధవరం గ్రామ సర్పంచ్ మోగులయ్య , మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలెమోని రామకృష్ణ, గొల్ల రాజు, పెంటమిది రఘు, పేరి రామకృష్ణారెడ్డి, జంగిడి రవి, గూప కురమయ్య, మూర్తి, రఘు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.





