(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీ, ఉమామహేశ్వరి కాలనీలో నివాసం ఉంటున్న తుమ్మ సౌజన్య కుమారి గత కొన్ని రోజుల నుండి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు మెరుగైన శాస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక స్థోమత లేకపోవడంతో బాధితురాలు *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * కలసిన అడిగిన వెంటనే ఈరోజు రెండు లక్షల రూపాయల LOC మంజూరు చేపించి లబ్ధిరాలుకు అందజేయడం జరిగింది..అనంతరం లబ్ధిరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కి, సహా మంత్రివర్యులకు, కూన శ్రీశైలం గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది..ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్,బాలప్ప ,మోటే శ్రీనివాస్ , కూన రాఘవేందర్ గౌడ్ , కృష్ణ యాదవ్ , రాకేష్ గార్లతో పాటు లబ్ధిరాలు, తదితరులు పాల్గొన్నారు..





