నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి మాల సంఘం అధ్యక్షులు నల్ల విజయ్ ఉప అధ్యక్షులు గడుగు తోమాయ్య గురువారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్షులు ఉప అధ్యక్షులు మాట్లాడుతూ మా పైన నమ్మకంతో సంఘం అధ్యక్షుని పదవి బాధ్యతలు అప్పగిస్తున్న తోటి మాల సంఘం పెద్దలకు, సంఘ సభ్యులకు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాల సంఘం అభివృద్ధి, హక్కులకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు





