నేటి సాక్షి, ప్రతినిధి అక్టోబర్ 25 : రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు హైదరాబాద్ జియాగూడలో 21 అక్టోబర్2025 నుండి 23అక్టోబర్ 2025 తేదీలలో జరిగిన 5వ G.F.I అండర్–19 రాష్ట్రస్థాయి పోటీలలో, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, ఇంటర్ CEC Ist ఇయర్ చదువుతున్న అజ్మీరా మానస రెజ్లింగ్ 55 కిలోల విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. ఈ విజయంతో ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.అజ్మీరా మానస 1నవంబర్ 2025 నుండి 5నవంబర్ 2025 వరకు హర్యానా రాష్ట్రం, పానిపట్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననుంది అని పాఠశాల ప్రధానోఉపాధ్యాయురాలు తెలిపారు.మానస విజయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఆవుల సునీత, పి ఈ టి,ఉపాధ్యాయ బృందం అభినందించారు.





