రెవెన్యూ సదస్సులకు మంచి స్పందన లభిస్తుందని రాయికల్ తహసీల్దార్ నాగార్జున తెలిపారు. రాయికల్ పట్టణంలోని గుడెటి రెడ్డి సంఘంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. రైతులు రెవెన్యూ సదస్సులను చక్కగా వినియోగించుకుంటున్నారని రైతుల భూ సమస్యలను సాధ్యమైనంతా త్వరగా పరిష్కరిసాతమని తెలిపారు. కాగ రాయికల్, మూటపెల్లి గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దేవదాస్, సింగిల్విండో అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, కొయ్యడి మహిపాల్రెడ్డి, గోపి రాజరెడ్డి, మున్నూ తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 13RKL01: సదస్సులో మాట్లాడుతున్న తహసీల్దార్ నాగార్జున





