మరుగుదొడ్లలో కంప వేశారు…
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో లక్షలు పెట్టి మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇట్టి మరుగుదొడ్లకు కాంట్రాక్టర్ డోర్లు బిగించలేకపోయారు. డోర్లకు బదులుగా కంప వేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులు వినియోగించలేకపోవడంతో బయట కు పోవాల్సి న పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మరుగుదొడ్లు చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాల నాయకులు పేట జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.





