7 నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి : మండలం లోని కాగతి గ్రామ పంచాయతీ, మర్రిమాకులపల్లి ప్రాథమికళపాఠశాలలో సంఘటన చోటుచేసుకున్నది.నాడు -నేడులో నిర్మించిన వంటగదిలో పైపెచ్చులు ఊడి పడ్డాయి.వంట గదిలో వంట మనిషి వంట చేస్తుండగా సీలింగ్ పెచ్చులు ఊడిపడటం తో ఆవిడ బయటకు పరుగులు తీసింది.వండిన అన్నం పై, వండుతున్న సాంబాలో సీలింగ్ పై పెచ్చులు ఊడి పడ్డాయి.ఎటువంటి ప్రాణాపాయం లేదని.ఆ సమయం లో విద్యార్థులు తమ తరగతి గదులలో ఉడటంతో ప్రమాదం తప్పిందని, ఈ విషయం మండల విద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగానదని, త్వరలో పూర్తిగా రిపేరు చేయిస్తామని ప్రధానోపాధ్యాయులు మురళీ మోహన్ తెలియజేశారు..





