నేటి సాక్షి, మెట్ పల్లి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్తలో ఉన్నందున అక్కడి విద్యార్థులకు తగిన వసతులు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ ఉన్నంత పాఠశాల శిథిలావస్తలో ఉన్నందున జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.మంగళవారం రోజున పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.విద్యార్థులకు పదిహేను రోజులలో తాత్కాలికంగా భవన పనులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.