నేటి సాక్షి అనంతగిరి మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్తు పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఎస్సై నవీన్ కుమార్ పరీక్షలకు ఉపయోగపడే ప్యాడ్లలను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత మార్కులు సాదించుకొని పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సలీమా,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





