Wednesday, January 21, 2026

*విద్యార్థుల భవిష్యత్తుకు ‘మోడీ గిఫ్ట్’గా సైకిళ్లు** కథలాపూర్ మండలంలో ఘనంగా కార్యక్రమం* 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా సైకిళ్లు అందజేసిన డా. చెన్నమనేని వికాస్—-*

నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన “మోడీ గిఫ్ట్” కార్యక్రమం కథలాపూర్ మండలంలో విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ముందుకు సాగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.*ఆరు గ్రామాల 10వ తరగతి విద్యార్థులకు లబ్ధి*ఈ కార్యక్రమంలో భాగంగా తక్కల్లపల్లి, బొమ్మెన, పోతారం, అంబారిపేట, తండ్రియాల, గంభీర్పూర్ గ్రామాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ విద్యార్థులకు స్వయంగా సైకిళ్లు అందజేశారు.*గ్రామీణ విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన కార్యక్రమం*ఈ సందర్భంగా డాక్టర్ వికాస్.. మాట్లాడుతూ, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ముందుకు సాగాలన్నదే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నారని చెప్పారు.*ఎన్నికలకే కాదు.. ఎప్పుడూ ప్రజలతోనే నాయకత్వం*ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి స్పందించే నాయకత్వం బండి సంజయ్ దని డాక్టర్ వికాస్ ప్రశంసించారు. విద్యే అభివృద్ధికి మూలమని నమ్మే భారతీయ జనతా పార్టీ, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.*విద్యతో పాటు నైపుణ్యాల పెంపుపై దృష్టి*విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబాలకు, సమాజానికి గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసవకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటే జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని హితవు పలికారు.ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు మల్యాల మారుతి,జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరరావు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు కంటే సత్యనారాయణ,బద్రి సత్యం, వినోద్ రెడ్డి, గాంధారి శ్రీనివాస్, రాచమడుగు శ్రీనివాసరావు, ధర్మపురి జలంధర్, గడిల గంగాప్రసాద్,వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News