నేటి సాక్షి – మల్లాపూర్*( పెంబి మహేష్ )మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేటకి చెందిన మహిళా శ్రీశైలంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాడారపు లక్ష్మి వారం రోజుల క్రితం శ్రీశైల దేవస్థానంలో సేవకై, మెట్ పల్లికి చెందిన బృందంతో వెళ్ళింది. చివరి రోజు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.___





