నేటి సాక్షి జిన్నారం:
పాశమైలారంలో గత సోమవారం జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ,
బొల్లారం మున్సిపల్ బిజెపి పట్టణ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బొల్లారంలోని హనుమాన్ మందిరం నుండి గాంధీ బొమ్మ చౌరస్తా వరకు కొవ్వొత్తులు వెలిగించి శాంతి ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
మృతులకు నివాళిగా శ్రద్దాంజలి గటించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మృతుల కుటుంబాలకు మనోధైర్యం నింపాలని ప్రార్ధించారు.





