నేటి సాక్షి (జిన్నారం) డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో జరిగిన సిఐటియు రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కె రాజయ్య ను ఎన్నుకోవడం జరిగింది. వరుసగా ఐదు మహాసభలోను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎనిక కావడం జరిగింది. ఈ సందర్భంగా కే రాజయ్య మాట్లాడుతూ రాబోయే కాలంలో కార్మికుల సమస్యలపై పోరాటాలు ఉదృతం చేస్తామని ఆయన అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతాంనని ఆయన తెలిపారు. పాలకులు తెచ్చే కార్మిక వ్యతిరేక విధానాలపై, కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారికి అండగా ఉంటామని తెలియజేశారు.





