పెట్టి అమలు చేస్తున్న స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో లీలా మాధవి కోరారు .స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్వచ్ఛరత కార్యక్రమాన్ని శనివారం ఎంపీడీవో లీలా మాధవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ రథం వచ్చినప్పుడు చెత్తను ఇస్తే అంత తగ్గట్టుగా నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు, ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మస్తాన్ ఈఓఆర్డి మహేష్ మండలంలోని కార్యదర్శులు పాల్గొన్నారు

