Saturday, March 7, 2026

*స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్** ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడమే లక్ష్యం: డీఎస్పీ రాములు* ఎన్నికల సమయంలో పోలీసులకు సహకరించాలి – ప్రజలకు విజ్ఞప్తి—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.*భద్రతా చర్యల్లో భాగంగా ఫ్లాగ్ మార్చ్*మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా కోరుట్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు, గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.*డీఎస్పీ రాములు హెచ్చరికలు, సూచనలు*ఈ సందర్భంగా మెట్‌పల్లి డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వారిపై, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రాములు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను భంగపెట్టే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టంగా తెలియజేశారు.ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయంగా జరగాలంటే అన్ని వర్గాల ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ రాములు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ ఫ్లాగ్ మార్చ్‌లో సీఐలు అనిల్ కుమార్, సురేష్ బాబు, ఎస్‌ఐలు చిరంజీవి,శ్రీధర్, కిరణ్ కుమార్,అనిల్,నవీన్, రామచంద్రం,పోలీస్ సిబ్బంది పాల్గొని పట్టణమంతా గస్తీ నిర్వహించారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News