నేటిసాక్షి, కరీంనగర్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగమేళాకు పలువురు విద్యార్థులు హాజరయ్యారు. టెక్ బీ ప్రోగ్రాంలో భాగంగా 2024, 2025లో ఇంటర్ పూర్తయిన, 2026లో ఇంటర్ పూర్తిచేసుకోబోతున్న విద్యార్థులకు మేళా నిర్వహించారు. 8 మంది పాల్గొనగా, నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు క్లస్టర్ లీడ్ క్రాంతి తెలిపారు.

