నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్7,కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వందేమాతరాన్నీ బంకించంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంచార్జీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్య్ర ఉద్యమంలో ఉద్యమకారులలో స్వాతంత్య్ర కాంక్ష ను రగిల్చి ప్రేరణ గా నిల్చిoది అని అన్నారు.. ఇట్టి కార్యక్రమం లో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





