నేటి సాక్షి,నారాయణపేట ఫిబ్రవరి 9, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ )మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నారాయణపేట టౌన్ పరిధిలో పోలీసుల తనిఖీలలో పెరపల్ల గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్ అనే వ్యక్తి వద్ద నారాయణపేట పట్టణంలోని శాసనపల్లి రోడ్డు లో అక్రమంగా తరలిస్తున్న 16.44 లీటర్ల మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం రవాణా, నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





