-కొనసాగుతున్న కృష్ణా జలాల నీటి సరఫరా..
నేటి సాక్షి, దేవరకద్ర జులై 13
మహబూబ్ నగర్ జిల్లా
దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం నాటికి నీటిమట్టం 24 ఫీట్లకు చేరింది. జూరాల ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలను గత కొన్ని రోజులుగా కోయిల్ సాగర్ కు తరలిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. కృష్ణ జలాల రాకతో కోయిల్ సాగర్ కు జలకళ వచ్చింది. దీంతో కోయిల్ సాగర్ ప్రాజెక్టును చూడడానికి వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. కోయిల్ సాగర్ పూర్తి నీటి నిల్వ స్థోమత 32.5 ఫీట్లు.