-దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి..
నేటి సాక్షి, దేవరకద్ర జులై 13
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ చారిత్రాత్మక నిర్ణయం అని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
(జిఎంఆర్) అన్నారు.కాంగ్రేస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే రిజర్వేషన్లు కల్పించి వారికి సముచిత స్థానం కల్పించిందన్నారు.
దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు BC లకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
సామాజిక విప్లవానికి నాంది పలికి చారిత్రాత్మక ఆవిష్కరణ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ శాసన సభ్యులుగా ఉండటడం జీవితంలో చేసుకున్న అదృష్టమని ఎమ్మెల్యే అన్నారు.బీసీ రిజర్వేషన్ల పట్ల మాకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు.. కానీ కనీసం హర్షించే (స్పందించే) స్థితిలో
బిఆర్ఎస్, బిజెపి పార్టీలు లేకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు.ఎవరు దొంగలు అనేవిషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.కేంద్రంలోని బిజెపికి అన్ని బిల్లులకు వాళ్ల హయంలో బి ఆర్ ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు.