యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత ఈరోజు మనకందరికీ స్వస్థత కలుగుచున్నది.: బ్రదర్. శాంసన్ ఎఫ్రా…రిపబ్లిక్ న్యూస్ 03 ఏప్రిల్ పాములపాడు:- పాములపాడు మండల కేంద్రంలో, గుడ్ ఫ్రైడే వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరిపారు. జెరూషలేము మినిస్ట్రీలో వ్యవస్థాపకుడు.బ్రదర్ శాంసన్ ఏఫ్రా గారు.మాట్లాడుతూ ఏసుక్రీస్తు వారు మన అతిక్రమంలోని బట్టి, ఆయన గాయపరచబడే ను. మన దోషములను బట్టి, ఆయన శరీరం నలుగు కొట్టబడెను. మన సమాధానార్థమైన, శిక్ష ఏసుక్రీస్తు మీద పడెను. ఏసుక్రీస్తు పొందిన దెబ్బల చేత, మనకు స్వస్థత కలుగుచున్నది. అందుకే నేను మిమ్మును ప్రేమించినట్టే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఏసుక్రీస్తు మహా త్యాగానికి గుర్తు. ఈ గుడ్ ఫ్రైడే. మానవాళి పట్ల ప్రేమ నిస్సయము, కరుణ శత్రువుల పట్ల దయ జాలి ఆకాశమంతటి సహనం అవధులు లేని త్యాగం ఇది ఏసుక్రీస్తు త్యాగం. అంతేకాకుండా సిలువలో పలికిన 7. మాటలు క్లుప్తంగా వివరించడం జరిగినది… ఫస్ట్ మాట 1). తండ్రీ, విరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుము.రెండవ మాట 2). నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉందువు.మూడవ మాట 3). అమ్మా, యిదిగో నీ కుమారుడు, యోహాను, ఇదిగో నీ తల్లి నాల్గవ మాట 4). నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడచితివి.ఐదవ మాట 5). నేను దప్పి గోనియున్నాను ఆరవ మాట 6). సమప్తమైనది ఏడవ మాట 7). తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇల దేవుడు యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటల గురించి క్లుప్తంగా వివరించడం బ్రదర్.శాంసన్ ఎఫ్రా దైవ సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పాస్టర్ అమ్మ మణి మాల మాట్లాడుతూ యేసుక్రీస్తు బలిదానాన్ని పురస్కరించుకొని తనను శిలువ వేసిన వారిని సైతం క్షమించిన ఆయన యేసుక్రీస్తు దయ హృదయానికి ప్రతీకగా క్రైస్తవ సోదర సోదరీమణులకు మన జెరూషలేము మినిస్ట్రీ భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పవిత్ర దినం ఈ గుడ్ ఫ్రైడే అని మణి మాల అమ్మ సందేశం ఇచ్చారు.మరియు సంఘ విశ్వాసులు పెద్దలు, సిస్టర్స్, ఇంచార్జెస్ వచ్చిన 2500 మంది విశ్వాసులకు వారందరికీ మంచిగా ఆశీర్వాద భోజనం పెట్టడం జరిగినది..





