-రెండు రోజులపాటు పూజలు
నేటి సాక్షి,దేవరకద్ర జులై 1
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని చిన్నచింతకుంట మండలం శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో ఈనెల 6,7 తేదీలలో లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో మదనేశ్వర్ రెడ్డి, చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆషాడ శుద్ధ శయనేకాదశి (తొలి ఏకాదశి) పర్వదిన వేడుకలను పురస్కరించుకొని దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 6న ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 6:30 కు స్వామివారికి, అమ్మవారికి పంచామృతాభిషేకం, 9 గంటలకు విశ్వక్ సేవ, పుణ్య వాచనం, 10 గంటలకు కురుమూర్తి స్వామి వారికి లక్ష పుష్పార్చన,7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన,8 గంటలకు ప్రదోషకాలం పూజ,