నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : అక్రమంగా ఒడిషా నుండి సూరత్ కు తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్ల ను అరెస్ట్ చేసిన ఆత్మకూర్ పోలీసులు. వీరి నుండి 31లక్షల విలువైన సుమారు 62 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ముగ్గురు ఒడిషా రాష్ట్రనికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మరో నిందితుడు పరారీ లో ఉన్నట్లు ఆత్మకూర్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్ వెల్లడించారు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 1) కాన్షు జాను తండ్రి రవీంద్ర జాన వయస్సు 22 బుదాంబ ఒడిస్సా, 2) అలోక్ ప్రదాన్ తండ్రి లాబా ప్రదాన్ వయసు 22 బరుంబడి ఒడిస్సా, 3) మంగు ప్రదాన్ తండ్రి గోర్వాన్ ప్రదాన్ వయసు 38 ఒడిస్సా ప్రాంతానికి చెందిన వారని సీ ఐ తెలిపారు.

