జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)….(అక్టోబర్ 13):69వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ టైక్వాండో పోటీలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్స్ లో ఈనెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో స్థానిక జగిత్యాల పట్టణంలోని శ్రీ వాగ్దేవి పాఠశాల విద్యార్థి బొల్లె రోషన్(14 సంవత్సరాల విభాగంలో) కాంస్య పథకం సాధించాడు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన అభినందన సభలో జగిత్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ చక్రధర్ రావు , జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రెటరీ గాదే సంతోష్ , ప్రెసిడెంట్ గంగారావు గ, శ్రీ వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి సింగం సుమితా రాణి , కోచ్ దావనపల్లి రాహుల్ కుమార్ , జగిత్యాల జిల్లా తైక్వాండో కోచ్ లు బొల్లె రోషన్ ను అభినందించడం జరిగింది. ఈ పోటీల్లో నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ శ్రీమతి ఎం నాగమణి మరియు జగిత్యాల జిల్లా టైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ గాదే సంతోష్ బొల్లె రోషన్ కు కాంస్య పథకాన్ని అందించారు.





