నేటి సాక్షి, కరీంనగర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్వాధార్ హోమ్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు కార్బన్డై యాక్సైడ్ను గ్రహించి, మనకు కావాల్సిన ఆక్సిజన్ను చెట్లు అందిస్తాయని, ప్రతి మనిషి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. వృక్షో రక్షిత రక్షితః వృక్షాలను మనం రక్షిస్తే, మనల్ని వృక్షాలు రక్షిస్తాయని తెలిపారు. ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులకు మనము వృక్షాలని నిర్లక్ష్యం చేయడమే కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో పాటు లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, స్వాధార్ హోమ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

