నేటి సాక్షి, రాజేంద్రనగర్: నీటి ఎద్దడి నేపథ్యంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ వార్డు పరిధి శాంతినగర్కాలనీలో డిప్యూటీ మేయర్ పులపల్లి రాజేందర్రెడ్డి సొంత ఖర్చులతో ఆదివారం బోరు వేయించారు. 500 అడుగుల్లో నీళ్లు వచ్చాయి. దీంతో కాలనీలో నీటి ఎద్దడి తగ్గుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్కు కాలనీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.


