Sunday, January 18, 2026

వామ్మో పెద్దపులి

  • – పిల్లలతో కాగజ్​నగర్​ మండలంలో సంచారం

నేటి సాక్షి, కాగజ్​నగర్: కాగజ్‌నగర్‌ మండలంలో పెద్దపులి తన పిల్లలతో కలిసి సంచారం చేయడం కలకలం రేపింది. కాగజ్​నగర్‌ మండల సమీపంలోని గోంది అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలతో కలిసి స్థావరం ఏర్పాటు చేసుకుని సమీప ప్రాంతాల్లో సంచరిస్తుందన్నారు. దీంతో సమీప మండలాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News